సిద్దిపేట, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నాడు. మా జిల్లా ఊడపీకుతా అన్న నీకు మా జిల్లా ప్రజలు ఓట్లు వేయాలా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించం డి.. మన జిల్లాలు తీసేస్తా అని, మన ఆత్మగౌరవ ప్రతీక కేసీఆర్ను అగౌరవపర్చిన రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి” అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేటలోని తన నివాసంలో రాజనర్సు, రవీందర్రెడ్డి, సంపత్రెడ్డి, సాయిరామ్, వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సోంరెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్లో మీరున్నప్పుడు అక్కడ మీ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే మీరు చప్పట్లు కొట్టింది వాస్త వం కాదా? ముసిముసి నవ్వులు నవ్వా వు.. అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నావు కదా అని ప్రశ్నించారు. దశాబ్దాల పోరాటం, కేసీఆర్ కృషి ఫలితం మన సిద్దిపేట జిల్లా అని చెప్పారు. రేవంత్రెడ్డి ఏ జిల్లాను తీసేస్తారు? జిల్లాలు తీసి అభివృద్ధిని ప్రజలకు దూరం చేస్తావా? కేసీఆర్ పరిపాలనను వికేంద్రీకరణ చేస్తే .. మీరు కేంద్రీకరణ చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ నోట ఎప్పుడు కూడా నిజాలు రావన్నారు. ఆయన సిద్దిపేటకొచ్చి అభివృద్ధి జరగలేదన్నారు. ఇది నిజమా? అబద్ధమా? ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉంటదా అని అన్నారు. రేవంత్రెడ్డి కండ్లు చూడలేక పోతుండా.. కావాలని అబద్ధాలు ఆడుతున్నాడా? రాష్ట్రంలోనే కాదు దేశంలో పేరొందిన నియోజకవర్గాల్లో సిద్దిపేట ఒకటి అని హరీశ్రావు అన్నారు. అభివృద్ధిలో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో అందుకున్నది సిద్దిపేట నియోజకవర్గం అని చెప్పారు. రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో అవార్డులు ప్రకటిస్తే సిద్దిపేట పేరు లేకుండా అవార్డే లేదన్నారు.
కేసీఆర్, హరీశ్రావు సిద్దిపేటకు ఏం చేశారని రేవంత్రెడ్డి అడుగుతున్నాడు..? మరి సిద్దిపేటకు ఏం చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ సిద్దిపేటను జిల్లా చేసిండు, రైలు తెచ్చిండు, గోదావరి నీళ్లు, పోలీస్ కమిషనరేట్ తీసుకొచ్చారన్నారు. మెడికల్ కళాశాల, ఫార్మసీ, నర్సింగ్ కళాశాల, పీజీ కళాశాల ఎన్నో విద్యాలయాలను తీసుకొచ్చి విద్యాహబ్గా తీర్చిదిద్దామన్నారు. సిద్దిపేటకు ఐటీ హబ్, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయన్నారు. సిద్దిపేటలోని రైతుబజార్, సమీకృత మార్కెట్ను ఎక్కడి నుంచో వచ్చి చాలామంది చూసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వాటిని ఇతర పట్టణాల్లో కట్టుకుంటామని చెప్పి ఆయా పట్టణాల్లో నిర్మాణాలు చేసింది వాస్తవం కాదా..? ఇది లోకానికి తేల్వదా అని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట అభివృద్ధి కాలేదు అని పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం నమ్మాలా ..?అని అన్నారు. అన్నింటి కంటే మించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చింది సిద్దిపేట కదా అని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బయలుదేరితే ఆశీర్వదించి, ఆనాటి సీమాంధ్ర శక్తులను ఎన్నో కుట్రలు చేసిన వాటిని తిప్పికొట్టి అందించింది సిద్దిపేట గడ్డ అని చెప్పారు. సిద్దిపేట ప్రజల చైతన్యమే తెలంగాణ పార్టీని పుట్టించిందన్నారు. ఇవ్వాళ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అంటే కూడా సిద్దిపేట ప్రజల పుణ్యమే అని చెప్పారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు.. తెలంగాణ ఉద్యమమే లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. ఇయ్యాళ తెలంగాణ రాష్ట్రం లేకుంటే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తుకుంటా… ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగుకుంటూ బతుకుతుండే అని చెప్పారు. పదేండ్లుగా రేవంత్రెడ్డి ఏం మాట్లాడిండు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని అక్కడే అభివృద్ధి జరుగుతుంది అని కొన్ని వందలసార్లు మాట్లాడిండన్నారు. ఇవ్వాళనేమో ఇక్కడ అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నాడు. మరి ఏది నిజం అని ప్రశ్నించారు. మొన్నటి వరకు మాట్లాడింది మర్చిపోయినట్లున్నావు.. నీకు కొంత మతిమరుపు వ్యాధి ఉన్నట్లుంది అని అన్నారు.
సీఎం హోదాలో ఉన్నారు. గౌరవంగా, హుందాగా ఉంటే రాష్ర్టానికి మంచిది అని హరీశ్రావు అన్నారు. ఇవ్వాళ మీరు చేసిన అసందర్భ వ్యాఖ్యలు, మా మీద బురద జల్లాలని చెప్పి మీరు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రం లో పెట్టుబడులు రాకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలు అయిపోయిందన్నారు. నంగునూరు మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ బిడ్డ పెండ్లి పెట్టుకున్నాం.. భూమి అమ్ముదామంటే ఎవ్వరూ కొనడానికి ముం దుకు రావడం లేదు సార్ అని చెప్పిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు అమ్ముతారా.. అని అడిగినవాళ్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనడానికి రావ డం లేదు. ఇదేమి రాజ్యమని చెప్పిందన్నారు. తక్కువ ధరకు అమ్ముదామన్నా కొనడం లేవదన్నారు. రాష్ట్రం దివాళ తీసింది అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనవసరంగా మాట్లాడడం వల్ల రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా పోయాయన్నారు. పెట్టుబడిదారుల్లో అనుమానాలు రేకేత్తించేలా మీ మాటలు ఉన్నాయన్నారు. పెట్టుబడులు రాకుండా పోయి ఉద్యోగాలు రాక రాష్ట్ర ఆదాయం పడిపోయే పరిస్థితులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే తప్పుడు ఆలోచనలతో సెల్ఫ్గోల్ కొట్టుకున్నారన్నారు.మాకంటే నాలు గు మంచి పనులు చేయి..ప్రజలకు మంచి చేయి..అంతేగాని అనాలోచితంగా పిచ్చి వ్యా ఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.
రేవంత్రెడ్డిలా స్థాయిని దిగజార్చుకోలేనని హరీశ్రావు అన్నారు. ప్రజలకు అర్ధం కావడానకి చెబుతున్న… సిద్దిపేట చౌరాస్తాలో మాట్లాడుతూ హరీశ్రావు క్యాంప్ ఆఫీసులోనే కూర్చున్నాడు అని మాట్లాడుతాడు.. ఇక్కడనే కూసుండి ప్రసంగం వింటున్నాడని రేవంత్రెడ్డి మాట్లాడిండు.. ఆయన ఇక్కడ మైక్ పట్టుకునే సరికి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో ఇంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్లో ఉన్నానన్నారు.. ఒక సీఎం స్థాయిలో గింత చీఫ్ పాలిటిక్స్, చిల్లర అబద్ధాలు ఆడడం అవసరమా? అని ప్రశ్నించారు. మీకు ఇంటలిజెన్స్ లేదా? తాను ఎక్కడ ఉన్నానో నెట్వర్క్ తెల్వదా? అని ప్రశ్నించారు. క్యాంప్ ఆఫీసులో ఉన్నాను అని చిల్లర మాటలు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఎంత చిల్లర మాటలు, ఆబద్ధాలు మాట్లాడుతాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటదో రేవంత్రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుందన్నారు. అబద్ధాల పునాదుల మీద గోబెల్స్ ప్రచారాల మీద శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కారు. వెటర్నరీ కళాశాలను కొడంగల్కు ఎత్తుకపోయి సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి, మా జిల్లాకు అన్యాయం చేసిన నీకు సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే నైతక హక్కు ఉందా అని ప్రశ్నించారు. కొడంగల్లో కొత్తది పెట్టుకో మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడి కాలేజీ తీసుకుపోయి మా విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తావు అని మండిపడ్డారు. రూ. 150కోట్ల అభివృద్ధి నిధులను రద్దు చేశావ్. మెదక్, దుబ్బాక, గజ్వేల్ నిధులనూ వెనక్కి తీసుకున్నావ్. మా జిల్లా నోరు గొట్టి ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నావా? అని ప్రశ్నించారు.