గజ్వేల్, మే 16: గజ్వేల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షానికి గజ్వేల్ రింగ్రోడ్డు వెంబడి ఆరబెట్టిర ధాన్యం తడిసిముద్దయ్యింది. భారీ వర్షానికి వడ్లు రోడ్డు వెంబడి కొట్టుకపోవడంతో రైతులు వాటిని ఒకదగ్గరకు చేర్చుతున్నారు. సిం గాటం, శ్రీగిరిపల్లి, అహ్మదీపూర్, బూరుగుపల్లి, దిలాల్పూర్, శేర్పల్లి గ్రామాలకు వెళ్లే మార్గల్లో రోడ్ల వెంబడి అరబెట్టిన వడ్లు తడిసిపోయాయి. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
దుబ్బాక, మే 16 : దుబ్బాకలో గురువారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. సుమారు గంటకుపైగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. స్థానిక మార్కెట్ యార్డులో విక్రయానికి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంనీటిలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరికొంత ధాన్యం వర్షం నీటిలో కొట్టుకపోయింది. యార్డులో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మిరుదొడ్డి, మే 16 : ఉమ్మడి మిరుదొడ్డి మండల వ్యాప్తంగా గ్రామాల్లోని రైతులు ఆగ మాగం అయ్యారు. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రైతులు ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆర బెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది.
వర్గల్,మే16: వర్గల్ మండలంలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరబెట్టిన ధాన్యం కాస్తా వర్షార్పణం కావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.