Chandrababu Naidu | లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ఐదేండ్ల పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో జగన్కు బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. అనంతరం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపిస్తూ దానిని తగలబెట్టబోయి చేయి కాల్చుకున్నారు.
వైసీపీ మేనిఫెస్టో అంటూ ఓ పేపర్ను చేతపట్టుకున్న చంద్రబాబు దానికి నిప్పు అంటించారు. కాల్చేస్తున్నా, కాల్చేశా.. చూశారా తమ్ముళ్లు అంటూ ప్రచారం రంథం ఇరువైపులా ఉన్న పార్టీ కార్యకర్తలు, ప్రజలకు చూపిస్తున్నారు. ఇంతలో మంట చంద్రబాబు చేతివేళ్ల వరకు వచ్చింది. ఆయ వేళ్లకు మంట సెగ తగలడంతో దానిని ప్రచార రథం కుడివైపునకు వదిలేదారు. అయితే దానిపక్కన ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఈ ఘటన అక్కడ నవ్వులు పూయించింది. బాబు సహా ఆ ప్రచారం రథంపైన ఉన్నవారు కూడా నవ్వులు చిందించడ గమనార్హం.
తగలబెట్టబోయి చేయి కాల్చుకున్న చంద్రబాబు pic.twitter.com/cew7h7sWTT
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024