కౌశాంబి : అందరూ ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకుంటూ జన్మనిచ్చిని తండ్రికి అభినందనలు తెలుపుతుండగా.. ఓ దుర్మార్గుడు కన్నతండ్రినే హతమార్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఆదివారం ఉదయం జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా తమ పురోగతికి తండ్రి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఆయన ఆశీర్వాదం తీసుకొని బహుమతులు ఇస్తుండగా.. రిటైర్మెంట్ డబ్బు కోసం ఆశపడ్డ ఓ కొడుకు తండ్రిని దారుణంగా హత్యచేశాడు.
కౌశాంబిలోని మంజన్పూర్ పట్టణానికి చెందిన గాంధీనగర్ మొహల్లాలో బైజ్నాథ్ (61) రైల్వే ఉద్యోగి. గత మార్చి నెలలో పదవీ విరమణ పొందారు. గత కొన్నాళ్లుగా ఆస్తి పంపకాలపై కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. వీరి కుమారులు సురేంద్ర, వీరేంద్రలు తండ్రి రిటైర్మెంట్ డబ్బుతో పాటు ఆస్తి పంపిణీపై గొడవ పడ్డారు. ఈ కారణంగా బైజ్నాథ్ తన చిన్న కుమారుడు నరేంద్ర, కుమార్తె పూజతో కలిసి మరొక ఇంట్లో నివసిస్తున్నారు.
ఆదివారం ఉదయం బైజ్నాథ్ పొలం నుంచి పశుగ్రాసంతో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సురేంద్ర, ఆయన భార్య వచ్చి అడ్డగించారు. వారు బైజ్నాథ్ ను తమ ఇంటికి తీసుకెళ్ళి తలుపు మూసివేసి కనికరం లేకుండా రాడ్లు, పంచ్లతో కొట్టారు. సురేంద్ర కుమారుడు సచిన్ కూడా ఈ దాడిలో పాలుపంచుకున్నాడు. విషయం తెలుసుకున్న నరేంద్ర, తల్లితో అక్కడికి చేరుకుని బైజ్నాథ్ను సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేసుకుని మంజన్పూర్ పట్టణ సీఐ కేజీ సింగ్ దర్యాప్తు చేస్తున్నారు.
కరోనాకు గురై టీఎంసీ ఎమ్మెల్యే కన్నుమూత
రిగ్గింగ్ జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన టీఎంసీ అభ్యర్థులు
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్కు 134 ఏండ్లు
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..