Harish Rao | హైదరాబాద్ : వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బాధ కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఏం జరుగుతున్నది..? విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా..? పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదా..? అని ప్రభుత్వాన్ని హరీశ్రావు నిలదీశారు.
చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయం. కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. విద్యార్థుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించండి. గురుకులాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | 1100 కోట్ల పనులను 5500 కోట్లకు ఎలా పెంచారు.. భారీ కుంభకోణం బయటపెట్టిన కేటీఆర్
KTR | అదే ఈస్టిండియా కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకిచ్చావ్.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం