న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) కోరుకుంటున్నది. దీనిలో భాగంగా లోటుపాట్లను గుర్తించేందుకు కోర్ ప్యానల్ను ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్యానల్ ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యసాలను, లోపాలను గుర్తించనున్నది. కోర్ కమిటీ సెక్రటరీ జనరల్ నేతృత్వంలో పనిచేసేలా ఏర్పాటుచేయాలని ఈసీ భావిస్తున్నది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అసోం, బిహార్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకోవడం, అనుభవాలు, లోపాలను ఈ కమిటీ గుర్తిస్తుంది. ఈసీఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, ఇటీవలి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, కొంతమంది ఎంపిక చేసిన ప్రత్యేక పరిశీలకులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఎన్నికల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఈ కమిటీ చేసే సూచనలు ప్రాముఖ్యత సంతరించుకోనున్నాయి.
ఎన్నికల సమయంలో ఈసీఐపై పలు కోర్టులు చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న ఎన్నికల కమిషన్.. భవిష్యత్లో ఇలాంటి మాట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు ప్యానెల్ను ఏర్పాటుచేస్తున్నది. ఇదే సమయంలో కేంద్రం కనుసన్నల్లో ఈసీ పనిచేస్తున్నదని గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న అపవాదును చెరిపేసుకునే ప్రయత్నం ఈసీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్తో చేతులు కలిపిన పీఎస్యూలు
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు రాజస్థాన్ నిర్ణయం
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..