ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా జేసీగా పనిచేసిన అనుభవం
పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా హనుమంతరావు నియామకం
2018 నుంచి జిల్లాకు సేవలు అందించిన హనుమంతరావు
సంగారెడ్డి, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి తోపాటు సిద్దిపేట ఇన్చార్జి కలెక్టర్గా హనుమంతరావు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సంగారెడ్డి కలెక్టర్గా డాక్టర్ ఎ.శరత్ నియమితులయ్యారు. పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్న శరత్ సంగారెడ్డి కలెక్టర్గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. బదిలీ అయిన హనుమంతరావు నాలుగేండ్లకుపైగా సంగారెడ్డి జిల్లాలో పనిచేశారు.
31 ఆగస్టు 2018లో సంగారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికలు సజావు గా జరిగేలా హనుమంతరావు కృషి చేశారు. 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేట కలెక్టర్గా ఉన్న వెంకట్రాంరెడ్డిని ప్రభు త్వం సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నియమించింది. 25 అక్టోబర్, 2020 నుంచి 15 నవంబర్ 2020 వరకు సంగారెడ్డి కలెక్టర్గా వెంకట్రాంరెడ్డి పనిచేశారు. అదే సమయంలో హనుమంతరావు మెదక్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. బదిలీల్లో భాగంగా హనుమంతరావు 16 అక్టోబర్ 2020 నుంచి సంగారెడ్డి కలెక్టర్గా కొనసాగుతున్నారు. నాలుగేళ్లకుపైగా సంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన హనుమంతరావును ప్రభు త్వం బదిలీ చేస్తూ పంచాతీరాజ్ డైరెక్టర్గా నియమించింది.
వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి అగ్రస్థానం
సంగారెడ్డి కలెక్టర్గా హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టా రు. వైకుంఠధామాలు, డింపింగ్ యార్డుల నిర్మాణ పనులు పూర్తి చేసి, సంగారెడ్డి జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. గ్రామాల్లో వందశాతం డంపింగ్ యార్డులు నిర్మాణాలు పూర్తయ్యేలా చూశారు. హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లాలో విజయవంతమయ్యేలా హనుమంతరావు చర్యలు తీసుకున్నారు. కరో నా సమయంలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడం తోపాటు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. జాతీయస్థాయిలో పోషన్ణ్ అవార్డును హనుమంతరావు అందుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పనిచేయడం మరువలేను
సంగారెడ్డి కలెక్టర్గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని హనుమంతరావు అన్నారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. కలెక్టర్గా సంగారెడ్డి జిల్లాతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమన్నారు. తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నేడు బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నియమితులైన డాక్టర్ శరత్ సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. కలెక్టర్గా నియ మి తులైన శరత్.. గతంలో సంగారెడ్డి జిల్లాలో పని చేసిన అనుభవం ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా శరత్ పనిచేశారు. 18 ఆగస్టు 2011 నుంచి 30 మార్చి, 2015 వరకు జాయింట్ కలెక్టర్గా శరత్ పనిచేశారు. సంగారెడ్డి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తిరిగి కలెక్టర్గా రానున్నారు.