భోపాల్, ఏప్రిల్ 30: రండి.. ఓటేయండి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్లు గెల్చుకోండి.. అంటున్నారు మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ మేరకు నజరానాలు ప్రకటించారు. టీవీలు, ఫ్రిజ్లు, స్కూటర్లు, బైక్లు కూడా బహుమతులుగా ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు.
2019 ఎన్నికలతో పోలిస్తే 2024 మొదటి, రెండో విడత పోలింగ్లో మధ్యప్రదేశ్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో అప్రమత్తమైన భోపాల్ అధికారులు ఈ బహుమతి స్కీమ్ను ప్రవేశపెట్టారు. దీని కోసం భోపాల్లో పలు చోట్ల కూపన్ బాక్స్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వివరాలతో ఫారాలను నింపి కూపన్ బాక్స్లలో వేయాలి. విజేతలు తాము ఓటేసినట్టు వేలిపై ఉన్న సిరా ముద్రను చూపిన తర్వాతే వారికి బహుమతి ఇస్తారు.