న్యూఢిల్లీ: విమానాల్లో 12 ఏండ్ల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీచేసింది. పిల్లల సీటింగ్ సమస్యలను పరిష్కరించేలా నిబంధనలు సవరించినట్టు పేర్కొన్నది.
మరోవైపు, విమానసంస్థలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. జీరో బ్యాగేజ్, సీటింగ్ ప్రాధాన్యం, మీల్స్/స్నాక్స్/డ్రింక్స్, సంగీత పరికరాలు తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేయొచ్చని తెలిపింది.