సంగారెడ్డి : ప్రజల అవసరాలను గుర్తించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేపడితే చిరస్థాయిగా నిలిచిపోతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఊట్ల పంచాయతీ దాదిగూడ గ్రామంలో సీసీ నిర్మాణానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే రూ.25లక్షల సొంత ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
జిన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ చాలా వరకు పూర్తి చేశామని, మిగిలిన కొన్ని పనులు కూడా చేపడుతామన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ గంగు రమేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : సంప్లో పడి వ్యక్తి మృతి
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన