ప్రత్యేక ఆకర్షణగా యాదాద్రి దేవాలయ నమూనా ప్రతిమ
లండన్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపిస్తున్న జాతీయ పార్టీకి యూకేలోని ప్రవాస తెలంగాణవాసులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ వెంట ఉండి రాష్ట్రాన్ని సాధించినట్లుగానే దేశ అభివృద్ధి కోసం కేసీఆర్ వెంట నడిచి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్ ’ అంటూ నినాదాలు చేశారు. ప్రవాసులంతా కేసీఆర్ వెంటే ఉంటామని నినాదించారు.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు చేనేత దుస్తులు ధరించి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత హై కమిషన్ ప్రతినిధి లక్ష్మి నారాయణన్, స్థానిక హౌన్సలౌ డిప్యూటీ మేయర్ కౌన్సిలర్ ఆదేశ్ ఫర్మాన్ లు పాల్గొన్నారు.
సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ చేనేతకు అందిస్తున్న చేయూతను స్పూర్తిగా తీసుకుని ప్రతీ సంవత్సరం ‘చేనేత బతుకమ్మ, దసరా’ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ లోని ఏదో ఒక ముఖ్యమైన , చారిత్రాత్మక కట్టడాల నమూనా ప్రదర్శనలో భాగంగా ఈ ఏడాది యాదాద్రి దేవాలయ నమూనాను ప్రదర్శించారు. మహిళలు బతుకమ్మ ఆట పాటలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం అలాయ్-బలాయ్ను ఘనంగా నిర్వహించారు. స్వదేశం నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారి లండన్ కు వచ్చిన అనిల్ కూర్మాచలం టాక్ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షులు శుష్మణారెడ్డి, సత్యమూర్తి చిలుముల, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శు లు సురేశ్ బుడగం, జాహ్నవి దుసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేశ్ పాస్తం ,రాకేశ్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి,మాధవ్ ,సతీశ్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య , శ్రీ విద్య, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్ ,రాజేశ్ వర్మ, క్రాంతి రేటినేని, మమత జక్కీ, శ్వేతా మహేందర్, మధుసూదన్ రెడ్డి, శ్వేతా రెడ్డి, శశి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ , నిఖిల్ , సందీప్ బుక్క ,అక్షయ్ , మౌనిక, ప్రవీణ్ వీర, రంజిత్ , వంశీ , నరేశ్ , నాగరాజు , మ్యాడి తదితరులు పాల్గొన్నారు.