చండీగఢ్ : డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆదివారం కరోనా పాజిటివ్గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఉందని చెప్పడంతో రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో పరీక్షలు చేయించారు.
అనంతరం అక్కడి నుంచి మెదాంత దవాఖానాకు కొవిడ్ పరీక్షలకు తరలించారు. ఫలితాల్లో పాజిటివ్గా తేలిందని అధికారులు పేర్కొన్నారు. గత నెలలోనూ డేరా బాబా లోబీపీతో పీజీఎంఐఎస్ ఆసుపత్రిలో చేరగా.. కొవిడ్ పరీక్ష చేసుకునేందుకు నిరాకరించారు. ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసినందుకు 2017 ఆగస్టులో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతనికి, మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఇటీవల తాను వ్యవసాయం చేసుకుంటానంటూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను చేసిన నేరాలు క్షమించరాని పెద్ద నేరాలేమీ కాదని.. జైలులో తన సత్ప్రవర్తన చూసి పెరోల్ ఇవ్వాలని వేడుకున్నారు.