న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు, నాలుగు నెలల గరిష్ఠానికి డెత్ టోల్ చేరింది. ఒక్క డిసెంబర్ నెలలోనే 9 కరోనా మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో ఐదు, అక్టోబర్ నెలలో నాలుగు, నవంబర్ నెలలో ఏడు కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో నవంబర్ నెలాఖరుకు మొత్తం కరోనా మరణాలు 25,098కు, డిసెంబర్ నెలాఖరుకు ఇది 25,107కు చేరింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 14,46,415 కరోనా కేసులు నమోదయ్యాయి. 14.18 లక్షల మంది రోగులు కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.73 శాతానికి పెరిగింది.