హైదరాబాద్: హైదరాబాద్లో సెల్ఫోన్లు చోరీచేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 7.03 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (CP Kothakota Srinivas Reddy) మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిందితుల్లో 12 మంది హైదరాబాద్కు చెందినవారు, ఐదుగురు సూడాన్ వాసులు ఉన్నారని చెప్పారు.
చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్ఫోన్లను అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఫోన్లను అక్కడే డిస్మెంట్ చేస్తున్నారని వెల్లడించారు. ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీశ్ మార్కెట్లో ఇలాంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటుచేశాడని పేర్కొన్నారు. ఐఫోన్లను కూడా రూ.8 వేల నుంచి అమ్ముతున్నారని చెప్పారు. సెల్ఫోన్లను సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారని తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువగా ఉంటుందని, పడవల్లో వాటిని తీసుకెళ్తున్నారని వెల్లడించారు.