హసన్పర్తి : ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయా లని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రగట్టు గుట్ట సమీపంలో గ్రేటర్ 1, 2, 55, 56, 65, 66 డివిజన్లు, హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామాల బూత్ స్థాయి సమావేశం నిర్వహించగా అభ్యర్థి సుధీర్కుమార్తో కలిసి, దాస్యం హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్కు నమ్మక ద్రోహం చేసి, ఇతర పార్టీలో టికెట్ తెచ్చుకున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, ఆత్మ మాజీ చైర్మన్ చంద్రమోహన్ పాల్గొన్నారు.