జూబ్లీహిల్స్, మే 6: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన ఐఎస్సీ, ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఒక ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. ఐసీఎస్ పరీక్షలో హెచ్పీఎస్ బాలికలు మూడు స్ట్రీమ్లలో అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. కాకి హర్షిత ఐఎస్సీ సైన్స్ స్ట్రీమ్లో 93.80 శాతం (469/500) తో స్కూల్ టాపర్గా నిలిచింది. హ్యుమానిటీస్ విభాగంలో మైలపల్లి రాణి ధన్యరూప 93.40 శాతం (467/500) తో ప్రథమ స్థానంలో నిలిచింది. భావ్య గార్గ్ 93 శాతంతో (465/500) ద్వితీయ స్థానంలో, వంశిక సంచేతి కామర్స్ స్ట్రీమ్లో 91.40 శాతం (457/500) తో అగ్రస్థానంలో నిలిచారు. హెచ్పీఎస్ నుంచి ఐసీఎస్ఈ పరీక్షలో 236 మంది విద్యార్థుల్లో 183 మంది జిల్లా స్థాయి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. అగ్రస్థానంలో అర్జున్ రావు 98.3 శాతం, యార్లగడ్డ హర్ష, శ్రీ విష్ణు, శ్రీయాన్స్ బాల్, సిద్ది బహేతి 97.2 శాతంతో ద్వితీయ స్థానంలో నిలువగా.. గ్రాంధి అచ్యుత, సూర్య అంకిత్ 97 శాతంతో రెండో స్థానంలో నిలిచారు.