ముంబై, మే 6: ప్రైవేట్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సిగులర్ గుఫ్.. హైదరాబాద్కు చెందిన మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్లో పెట్టుబడులు పెట్టింది. రూ.240 కోట్లతో దాదాపు 3.5 శాతం యాజమాన్య వాటాను సొంతం చేసుకున్నట్టు సోమవారం సిగులర్ కంపెనీ ప్రకటించింది.
కాగా, బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలను సాగిస్తున్న స్పందన స్ఫూర్తి సంస్థ నిర్వహణలోని ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.11,970 కోట్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే గతంలో దేశంలోని సిటీ యూనియన్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్, రెప్కో హోం ఫైనాన్స్ల్లోనూ సిగులర్ పెట్టుబడులను పెట్టింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 16 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులున్నాయి.