చండ్రుగొండ, మే 6: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, గద్దెనెక్కాక ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. చండ్రుగొండలో సోమవారం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. తాను ఖమ్మం స్థానికుడినని, కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు పెరిగాయని, సాగునీళ్లు-రైతుబంధు-రుణ మాఫీ అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఇవన్నీ ప్రస్తావిస్తూ, కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నాయకులను నిగ్గదీసి ప్రశ్నించాలని కోరారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగమణి, వగ్గెల పూజ, సున్నం నాగమణి, కొణకండ్ల వెంకటరెడ్డి, దారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, నరుకుళ్ల సత్యనారాయణ, భూపతి రమేష్, సూర వెంకటేశ్వరరావు, నల్లమోతు వెంకటనారాయణ, మేడా మొహన్రావు, గాదె లింగయ్య, కళ్లెం వెంకటేశ్వర్లు, పాండ్ల అంజన్రావు, గుగులోత్ శ్రీనివాస్నాయక్, చీదెళ్ల పవన్కుమార్, చాపలమడుగు రామరాజు, రాందాసు, సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, మద్దిరాల చిన్ని పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి, మే 6: బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సోమవారం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఎంపీగా తాను అందించిన సేవలను వివరించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు భారత లాలమ్మ, అయిలూరి కృష్ణారెడ్డి, నాయకులు సున్నం నాగమణి, వగ్గెల పూజ, కూరాకుల నాగభూషణం, బోయినపల్లి సుధాకర్రావు, మామిళ్లపల్లి రామారావు, కొత్తూరి వెంకటేశ్వరావు, నర్సారెడ్డి, వీరబోయిన వెంకటేశ్వర్లు, చల్లా రాంబాబు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలో ఎంపీ నామా విజయాన్ని కాంక్షిస్తూ ఉపాధి హామీ పథకం పనుల వద్ద ప్రచారాన్ని నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి, మే 6 : ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్కాలనీ పంచాయతీ, అశోక్నగర్ పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేశారు. నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు, శ్రీనగర్ సీనియర్ ఎంపీటీసీ కొల్లు పద్మ, గుర్రం బాబురావు, కొల్లు కొండల్రావు, కొల్లు సంపత్కుమార్, సంతోష్కుమార్, పావని, రజని, చిట్టెమ్మ, రాణి, సీతమ్మ, రేణుక, లావణ్య, విజయలక్ష్మి, నాగమ్మ, జ్యోతి,సునీత, ఎల్లమ్మ, సరోజినిపాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, మే 6 : సుజాతనగర్ మండలంలో కొత్తగూడెం డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, భూక్యా విజయలక్ష్మి, పెద్దమల్ల నరే్రందకుమార్, మాజీ సర్పంచులు బానోత్ లక్ష్మణ్, ఇరాని, బూరుగు కృష్ణచైతన్య, ఆంగోత్ గంగా, రాందాస్, శ్యాంసుందర్రెడ్డి, కనుకుంట్ల నిర్మల పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఓటును కారు గుర్తుపై వేసి నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పాల్వంచ, మే 6 : మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నవభారత్ 9వ బూత్లో బీఆర్ఎస్ నాయకులు నామా గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పరిటాల, భూక్యా వీరన్న, సుబ్బారావు, రమేశ్, రాంబాబు, శంకర్, వీరస్వామి, దినేష్, యాకేష్, హరి, కౌశిక్, గణేష్, కమలాకర్, రఘు, శేఖర్, నూనావత్ సురేష్, కుమార్, సత్యం, నక్క నరసింహారావు, నవభారత్ ఆనంద్ పాల్గొన్నారు.
కొత్తగూడెంలో& కొత్తగూడెం అర్బన్, మే 6 : కొత్తగూడెం పట్టణంలోని 5వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేసి నామాను గెలిపించాలని అభ్యర్థించారు. తలుగు అశోక్, మున్నా, కేకే, ఈశ్వర్, బుడ్డి, హమీద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ములకలపల్లి, మే 6: ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఖతం అవుతుందని జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు. సోమవారం మండలంలో ఉపాధి హామీ పథకం పనుల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నాగమణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీయలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మెహ్రమని, నాయకులు పుష్పాల హనుమంతు, శనగపాటి సీతరాములు, బండి కొమరయ్య, ఐతం రాజు, నాగేశ్వరావు, సున్నం బాబురావు, రవి, శేషు, పాల్గొన్నారు.
జూలూరుపాడు, మే 6 : అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత హామీలతో మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ మాయమాటలతో గ్రామాల్లోకి వస్తున్నారని, వారిపై తిరగబడాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్రోడ్డు సమీపంలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలను, రుణమాఫీ పేరుతో రైతులను, చేయూత పేరుతో పింఛన్దారులను ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తిరిగి వాళ్లమాటలు నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోవాల్సి వస్తదని ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి తెలంగాణ సంక్షేమం కోసం పనిచేసిన వారికే ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, జిల్లా అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు, జడ్పీటీసీ భూక్యా కళావతి, నాయకులు సత్యనారాయణ, కృష్ణమూర్తి, వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.