బొల్లారం, మే 6: కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ప్రచారానికి అద్భుత స్పందన వస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని పలు వార్డుల్లో ప్రచారం చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లారెడ్డి కోరారు. మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను గెలిపించుకొని కేసీఆర్కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.