KIA | న్యూఢిల్లీ, మే 17: ‘కియా లీజ్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి కియా శ్రీకారం చుట్టింది. ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్తో భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ లీజింగ్ను కియా పరిచయం చేసింది. తొలి దశ కింద హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో లీజుకు కియా కార్లు అందుబాటులో ఉండనున్నాయి. లీజు కాలం పూర్తయిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. అవసరాన్ని, ప్రాధాన్యతలనుబట్టి మరో కొత్త మాడల్ కారును మళ్లీ లీజుకు తీసుకోవచ్చు. ‘లీజింగ్ మాడల్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నది. భారత్లోనూ దీనికి విశేష ఆదరణ లభిస్తున్నది. అందుకే ‘కియా లీజ్’ను తీసుకొచ్చాం. దీనివల్ల మా కస్టమర్లు మున్ముందు ఇంకా పెరుగుతారు’ అని ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మైయుంగ్-సిక్ సోన్ ఆశాభావం వ్యక్తం చేశారు.