నటీనటులకు పాత్రల డిమాండ్ మేరకు కొన్ని త్యాగాలు తప్పనిసరి. కొందరు ఆ త్యాగాలు చేయలేకే సినిమాలను కూడా వదిలేసిన దఖలాలున్నాయి. ముఖ్యంగా పెదవి ముద్దుల విషయంలో కొందరు హీరోయిన్లు కచ్చితంగా ఉంటారు. అందుకే అలాంటి ఇంటిమేట్ సన్నివేశాలు కథలో ఉంటే, దర్శకులు కూడా అందుకు అంగీకరించే హీరోయిన్లనే ఎంచుకుంటారు. ఖలీస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బేబీ జాన్’ సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సీనే ఒకటుందట. ఆ సన్నివేశం కథకు చాలా ఇంపార్టెంట్ కావడంతో ఆ సన్నివేశంలో నటించేందుకు అభ్యంతరం తెలుపని కథానాయిక కోసం ఆయన వెతికారట.
ఆ వెతుకులాటలో కీర్తిసురేశ్ అతనికి దొరికిందని బాలీవుడ్ సమాచారం. కథ, పాత్ర.. రెండూ నచ్చడంతో ఈ మహానటి పెదవి ముద్దుకు ఓకే చెప్పేసిందన్న వార్త బీటౌట్లో బలంగా వినిపిస్తున్నంది. వరుణ్ధావన్ పంట పండిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కెరీర్ ప్రారంభం నుంచీ స్కిన్షోకు దూరంగా ఉన్నది కీర్తిసురేశ్. ‘మహానటి’ ప్రభావంతో వరుస పరాజయాలు కూడా ఎదుర్కొన్నది. దాంతో మహేశ్ ‘సర్కారువారి పాట’ నుంచి కీర్తి రూట్ మార్చింది. కథానాయికగా ఎదగాలంటే పట్టువిడుపులు తప్పనిసరి అని గ్రహించి, తెలివిగా ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే తన తొలి బాలీవుడ్ మూవీలో ఈ సాహసానికి సిద్ధపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.