Loksabha Elections 2024 : తనను గాంధీ కుటుంబ సహాయకుడినని కాషాయ పార్టీ గుప్పించిన విమర్శలపై అమేథి కాంగ్రెస్ అభ్యర్ధి కేఎల్ శర్మ స్పందించారు. తాను గాంధీ కుటుంబ సేవకుడిని కాదని, రాజకీయ నేతనని శర్మ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అమేథి నుంచి తాను పోటీ చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని చెప్పారు.
తాను ఎన్నో ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, తనకు యూత్ కాంగ్రెస్తో అనుబంధం ఉన్నప్పటి నుంచి 1983లోనే తాను అమేథికి వచ్చానని చెప్పారు. బీజేపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై రాహుల్ గాందీ తన ప్యూన్ను ఎన్నికల బరిలో నిలిపారని అంతకుముందు రాయ్బరేలి బీజేపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్ అన్నారు.
రాహుల్ గాంధీ నిజంగా రాయ్బరేలి, అమేథి స్దానాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. అసలు అమేథి నుంచి రాహుల్ తన ప్యూన్ను ఎందుకు ఎన్నికల బరిలో నిలిపారని నిలదీశారు. స్మృతి ఇరానీ అమేథి ప్రజలను తన కుటుంబసభ్యులుగా ఆదరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అమేథి, రాయ్బరేలి సీట్లలో ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పారు.
Read More :
Government Hospitals | దవాఖానల్లో పనిచేయని ఏసీలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న రోగులు