పటాన్చెరు, ఏప్రిల్ 3: సిద్దిపేట కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో బూత్ లెవల్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన వెంకట్రామిరెడ్డి అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం కుర్చీలో హుందాగా ఉండాల్సిన రేవంత్రెడ్డి అందరు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారిగా, కలెక్టర్గా 25 ఏండ్లు సమర్థవంతంగా పని చేసిన రికార్డు తనకుందన్నారు. నాకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడంతో గమనించి కీలక బాధ్యతలు ఇచ్చారన్నారు. ప్రజలకు సేవలందించడంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. అందుకే ప్రజలు నన్ను గుర్తించి ఆశీర్వదిస్తున్నారన్నారు. సిద్ధిపేట గడ్డ నుంచి కాంగ్రెస్ గెలుపు ఖాయమని రేవంత్రెడ్డి అన్నాడు.
కానీ మెదక్ ఎంపీగా తాను గెలవడం ఖాయమైందని వెంకట్రామిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అశీస్సులు, మాజీ మంత్రి హరీశ్రావు ప్రోత్సాహం, స్థానిక ఎమ్మెల్యేలు నాయకుల అండతో నాకు మంచి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా ఉంటూ బురదజల్లే స్థాయి మాటలు రేవంత్ నోటి నుంచి వస్తున్నాయని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మెదక్ ఉమ్మడి జిల్లా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అవే ఫలితాలు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్ తదితరులు ఉన్నారు.