గోవిందరావుపేట/మంగపేట, ఏప్రిల్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు, మంగపేట మండలం రాజుపేటలో పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా అభ్యర్థి కవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి మళ్లీ మోసపూరిత ప్రకటనలు విడ్డూరంగా ఉందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను మరోసారి మోసం చేయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఐదెకరాలున్న రైతులకు ఇంకా రైతుబంధు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే ప్రజలు తరిమి కొడుతారన్నారు. కేసీఆర్ పాలనలో మండు వేసవిలోనూ జలాశయాలు నిండుకుండలా ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో చుక్కనీరు లేక ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్య ర్థి మాలోత్ కవితను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి కోరారు. బీఆర్ఎస్ పాలనలో ములుగు జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, మళ్లీ ఎంపీగా కవితను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు మాట్లాడుతూ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. కవితను ఎంపీగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవిందనాయక్, పీఏసీఎస్ చైర్మన్ తోట రమేశ్, జిల్లా నాయకుడు కాకులమర్రి ప్రదీప్రావు, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మల్లూరు గుడి చైర్మన్ ముకుందం, పీఏసీఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్రావు, మండల ఉపాధ్యక్షుడు యడ్లపల్లి నర్సింహారావు, గ్రామ అధ్యక్షుడు చదలవాడ సాంబశివరావు, కొమరం ధనలక్ష్మి, కుర్బాన్అలీ, కర్రీ శ్యాంబాబు, మలికంట శంకర్, చిట్ట్టిమల్ల సమ్మయ్య, పూజారి శ్రీను, యర్రంగాని మోహన్రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.