CM KCR | బమ్మెర పోతన జయంతి సందర్భంగా.. ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మరించుకున్నారు. భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సాహితీ తేజోమూర్తి పోతన అని కొనియాడారు. కవిగా, సాహితీవేత్తగా, తెలంగాణ గడ్డ నుంచి పోతన నడయాడారన్నారు. సాహితీ శోభ తెలుగు సాహితీ చరిత్రలో అజరామరమై వెలిగిపోతుందన్నారు.
‘బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్’ అంటూ ఆత్మాభిమానం కలిగిన కవి పోతన అన్నారు. పోతన పద్యాన్ని వినని తెలుగువారుండరని అంటే అతిశయోక్తి కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పోతన స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. భవిష్యత్లో బమ్మెర పోతన ప్రాంతాన్ని సాహితీ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించారు.