బీజింగ్: అమెరికా, దాని మిత్రదేశాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని పెంచుకోవడంపై చైనా దృష్టి సారించింది. ఆఫ్ఘాన్, పాక్ విదేశాంగ మంత్రులతో భేటీ జరిపింది. ఆఫ్ఘనిస్తాన్లో మెరుగైన భద్రత, ఆర్థిక సహకారం కోసం ఇరుదేశాలు పిలుపునిచ్చాయి. గురువారం రాత్రి వర్చువల్ సమావేశం ద్వారా చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు పలు అంశాలపై చర్చించినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ సమావేశంలో అమెరికన్ దళాల ఉపసంహరణ క్రమబద్ధమైన పద్ధతిలో జరగాలని అంగీకరించారు. ఆఫ్ఘనిస్తాన్లో భద్రత, స్థిరత్వం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పేర్కొన్నది. ఆఫ్ఘనిస్తాన్, పొరుగు దేశాల ప్రయోజనాలను పరిరక్షించడానికి మూడు దేశాలు చర్చలను, సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయంచారు.
ఇదిలావుండగా, చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆఫ్ఘనిస్తాన్లో స్థిరత్వం ఆఫ్ఘనిస్తాన్ శాంతికి అవసరమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ముగ్గురం కలిసి ఈ పనిని ఎలా సాధించగలం, ఉమ్మడి లక్ష్యాలను ఎలా సాధించగలం అనే అంశాలపై దృష్టిసారించాలని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి పునరుద్ధరణకు అక్కడ తొలుత రాజకీయ స్థిరత్వం అవసరమని ఆయన అభివర్ణించారు. ఈ సమావేశం జరిగినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా సమాచారమిచ్చారు.
కేరళ బడ్జెట్: 20 వేల కోట్లతో రెండో కొవిడ్ ప్యాకేజీ ప్రకటన
ప్రాజెక్ట్ 75 : రూ.50 వేల కోట్లతో 6 జలాంతర్గాముల నిర్మాణం
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
పోస్ట్-కొవిడ్ ఫిట్నెస్ : నిత్యం 10 కి.మీ పరిగెత్తుతున్న మిలింద్ సోమన్
ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్గా ప్రకటించాలని పిటిషన్
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..