హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు విజయసాయిరెడ్డి ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ సైతం గడువు కోరడంతో విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు షరతులను ఉల్లంఘిస్తున్నారని, సాక్షులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కోర్టు షరతులను ఉల్లంఘించినందున ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.