బొల్లారంలోని పలు బస్తీల్లో ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరించి..వారి ఆశీర్వాదం తీసుకున్నారు. బస్తీ మహిళలు నివేదితకు బొట్టు పెట్టి..మంగళ హారతులతో స్వాగతం పలికారు. అండగా ఉంటామని దీవెనలు అందించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని, బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి, వార్డు ప్రెసిడెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.