KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ) : గడిచిన పదేళ్లలో మైనార్టీల అభివృద్ధికి రూ.22వేల కోట్లు ఖర్చు చేశామని, బీఆర్ఎస్తోనే వారి అభివృద్ధి సాధ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తరఫున బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ యన, మౌలాలీలోని బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశామని, అన్ని మతాలకు ప్రాధాన్యతనిచ్చామని గుర్తుచేశారు. మోదీ ప్రభు త్వం కల్లబొల్లి మాటలతో ప్రజల చెవుల్లో పూలు పెడుతూనే ఉందన్నారు. రూ.15 లక్షలు ఏమోగాని, జన్ధన్ ఖాతాల్లో రూ పాయి కూడా వేయలేదని, రైతుల జీవితాల్లో ఏ మార్పు రాలేదని, పేదలకు ఇండ్ల నిర్మాణం, 20 కోట్ల మందికి ఉపాధి అన్న బీజేపీ ఇప్పటివరకు చేసిందేమి లేదన్నారు.