KTR | హైదరాబాద్ : కేవలం ఊహాజనిత కట్టుకథలతో అల్లిన ఒక స్టోరీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ఢిల్లీ ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. ఈ దేశంలో అనేక పాలసీలు మార్చారు. అదానీ కోసం బొగ్గు పాలసీ, విమానయాన పాలసీ మార్చిన విషయం వాస్తవం కాదా..? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా ఢిల్లీ పాలసీ కేసు విచారణ చేస్తున్నా ఒక రూపాయి అయినా ఎక్కడైనా రికవరీ చేశారా..? కేవలం ఊహాజనిత కట్టుకథలతో అల్లిన ఒక స్టోరీ ఈ ఎక్సైజ్ పాలసీ కేసు. న్యాయ వ్యవస్థపై పూర్తిస్థాయి నమ్మకం ఉంది. మోడీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. బలమైన ప్రాంతీయ పార్టీ నాయకులు ఉండకూడదన్న లక్ష్యంతో ఈ రకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. బీజేపీలో చేరిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ఢిల్లీ ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. ఈ దేశంలో అనేక పాలసీలు మార్చారు
అదానీ కోసం బొగ్గు పాలసీ, విమానయాన పాలసీ మార్చిన విషయం వాస్తవం కాదా… వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు
రెండు సంవత్సరాలుగా ఢిల్లీ పాలసీ కేసు విచారణ చేస్తున్నా ఒక రూపాయి అయినా ఎక్కడైనా… pic.twitter.com/uzUJtyd3OA
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2024