రాయపర్తి/కాశీబుగ్గ/ఐనవోలు/ కాజీపేట/దామెర/ గీసుగొండ, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్షోలో పాల్గొనేందుకు ఆదివారం రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. 39 గ్రామాల నుంచి భారీగా నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు వెళ్లారు. అలాగే, హనుమకొండలో జరిగిన కేసీఆర్ బస్యాత్ర, రోడ్షోకు వరంగల్ 14, 3వ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బయల్దేరి వెళ్లారు. 14వ డివిజన్లో కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎనుమాముల నుంచి భారీగా తరలారు. కార్యక్రమంలో గంధం గోవిందు, పత్రి రాజపోషాలు, తూర్పాటి సంపత్, గండ్రాతి భాస్కర్ పాల్గొన్నారు. ఐనవోలు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు బయల్దేరి వెళ్లారు. హనుమకొండ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఎస్సీసెల్ నాయకుడు రాజు, సీనియర్ నాయకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కేసీఆర్ చేపట్టిన రోడ్డు షోకు కాజీపేట బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి. డివిజన్ల అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, దువ్వ కనుకరాజు, బెదరికొండ రంజిత్, కోటి, హరినాథ్ ఆధ్వర్యంలో తరలిన ర్యాలీకి నార్లగిరి రమేశ్, మర్యాల కృష్ణ, గబ్బెట శ్రీనివాస్, కార్పొరేటర్ సంకు నర్సింగరావు జెండా ఊపారు. దామెర మండలంలోని ల్యాదెళ్లలో ఎంపీపీ కాగితాల శంకర్, ఊరుగొండలో వైస్ ఎంపీపీ జాకీర్అలీ, దుర్గంపేటలో మండలాధ్యక్షుడు గండు రామకృష్ణ, ముస్త్యాలపల్లిలో గ్రామ అధ్యక్షుడు చిలువేరు రాజు, దామెరలో ఎంపీటీసీ పోలం కృపాకర్రెడ్డి, కోగిల్వాయిలో ఎంపీటీసీ సంగనబోయిన మౌనిక-కిరణ్, ఓగులాపురంలో శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు వెళ్లారు. గీసుగొండ మండలంతో పాటు గ్రేటర్ వరంగల్ గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
హనుమకొండ చౌరస్తా : గద్దెనెక్కడం కోసం రేవంత్రెడ్డి దొంగ హామీలు ఇచ్చిండు. ఒక్కటి కూడా చేస్తలేడు. ఫ్రీ బస్సుతో మాకు ఉపాధి పోయింది. బతుకు భారమైంది. ఎవరూ ఆటోలు ఎక్కడం లేదు. గిరాకీ వస్తలేదు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా. ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిండు. మా ఉసురు రేవంత్రెడ్డికి తాకుతుంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను ఎంతో బాగు చేసిండు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తలేరు. రూ.4 వేల పింఛన్ రాలేదు. కేసీఆర్ ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పాటు అదనంగా తులం బంగారం ఇస్తానన్నారు.. ఏ ఒక్కటి చేస్తలేరు. ఇప్పుడు ఎన్నికలు రాగానే అన్ని చేస్తానని మళ్లీ మోసం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రజలు రేవంత్రెడ్డి మాటలు నమ్మి మళ్లీ మో సపోరు. ఇప్పటికే ఎందుకు ఓట్లు వేసినమని బాధపడుతున్నాం.
కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయకుండా పెద్ద తప్పు చేసినం. ఇప్పుడు మాకు తెలుస్తాంది. ఎంతో బాధపడ్తానం. కేసీఆరే మళ్లీ సీఎం కావాలి. దొంగ హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి మాకు అవసరం లేదు. బస్సు ఫ్రీ చేస్తే సీట్ల కోసం అందరూ కొట్లాడుతుండ్రు. పొలాలకు నీళ్లులేవు. కరెంట్ సక్కగ ఉంటలేదు. ఊకే వస్తాంది.. పోతాంది.
నేను మేస్త్రీ పనిచేస్తాను. నా కాలు విరిగింది. కేసీఆర్ను చూసేందుకు హనుమకొండ చౌరస్తాకు వచ్చాను. దేశంలోనే కేసీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలిపిండు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అనేక పథకాలు ఇచ్చిండు. అందరికీ ఎంతో మేలు చేసిండు. 10 సంవత్సరాలు ప్రజలు సంతోషంగా ఉండె. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అందరూ ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, ప్రజలకు కష్టాలు తప్పలేదు.