Vinod Kumar | కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాయకుడు ఎండీ జమీలొద్దీన్ పాల్గొన్నారు.