నాగర్కర్నూల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : కందనూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గ్రాఫ్ను మరింత పెంచింది. దీంతో గ్రామస్థాయిలోనూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు స్పీడ్ జోరందుకున్నది. జిల్లాకేంద్రంలో కేసీఆర్ ప్రసంగం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలం పెంచగా కాంగ్రెస్, బీజేపీలను ఆత్మరక్షణలోకి నెట్టింది. కేసీఆర్ బస్సుయాత్ర కందనూలు బీఆర్ఎస్ కార్యకర్తల్లో సంబురాన్ని నింపింది. పార్లమెంట్ ఎన్నికల్లో భా గంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమం త్రి చేపట్టిన బస్సుయాత్ర నాగర్కర్నూల్లో విజయవంతమైంది. వేలాదిమంది పార్టీ నాయకులు, శ్రేణులు తర లిరావడంతో బీఆర్ఎస్ నాయకులు ఫుల్ జోష్లో ఉ న్నారు. కేసీఆర్ యాత్రకు వచ్చిన అశేష జన సందోహం కాంగ్రెస్, బీజేపీల్లో నిస్తేజాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ వస్తున్నా రు. కాగా శ్రేణుల్లో స్తబ్ధత నెలకొనగా ఇతర పార్టీలు చులకనగా చూస్తూ వస్తున్నారు. ఈక్రమంలో కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఆ అనుమానాలన్నింటినీ తుడిచిపెట్టేసింది. వేలాది ప్రజలు జిల్లాకేంద్రంలో మూడు కి లోమీటర్ల పొడవునా నిల్చొని కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహినిని చూసిన కాంగ్రెస్, బీజేపీల్లో భయం మొదలవగా బీఆర్ఎస్కు ఫుల్ క్రేజ్ను తీసుకొచ్చింది.
కేసీఆర్ వస్తుండడంతోనే కార్యకర్తల్లో న యా జోష్ నెలకొన్నది. ఈ యాత్రకు యువకులు, రైతు లు భారీగా తరలొచ్చి కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేకతను చాటారు. కేసీఆర్ అరగంట ప్రసంగాన్ని కేరింతలు, ఈలలు, నినాదాలతో ఆసక్తిగా విన్నారు. ప్రజల ఉత్సాహాన్ని చూసిన కేసీఆర్ సైతం ముగ్ధుడయ్యారు. ఆరు గ్యారెంటీల పేరుతో జరిగిన మోసాన్ని, బీజేపీ పథకాల పేర్లను చెప్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. సమావేశానికి రావడంతోనే సరిపెట్టుకోకుండా గ్రామాల్లో తాను చెప్పిన విషయాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని కేసీఆర్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల్లో స్పీ డ్ పెంచారు. కేసీఆర్ ప్రసంగాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని ప్రజలకు స్ప ష్టంగా వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను కేసీఆర్ ప్రశంసించిన తీరు ఆయనకు మరింత క్రేజ్ను తీసుకొచ్చింది. ప్రవీణ్ గొప్పతనం, ఆయన కమిట్మెంట్, గెలిపించాల్సిన ఆవశ్యకత, గెలిస్తే వచ్చే ఫలితాలను కేసీఆర్ విడమరిచి చె ప్పడం విశేషం. ఇది ఆర్ఎస్ ప్రవీణ్కు సానుకూలాం శం కానుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే ఆర్ఎస్పీకి ఉన్న ప్రత్యేకతను ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రజలకు వివరించారు. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు, ఆర్ఎస్ ప్రవీణ్ గెలుపునకు దోహదం చేయనున్నది. మొత్తం మీద కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సమాయాత్తం చేసింది. గ్రామగ్రామాన గులాబీదండు ఆర్ఎస్ ప్రవీణ్, బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేసింది.