KCR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల జీవితంలో అంధకారం నెలకొన్న సంగతి తెలిసిందే. సాగుకు సరిపడా నీరు, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయి. ఏదో అక్కడక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కు కూడా లేదు. ఇదంతా పక్కన పెడితే పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధు ఊసే లేదు. రైతుబంధు అడిగితే చెప్పులతో కొడుతామని రైతులను బెదిరించారు కాంగ్రెస్ నాయకులు. అటు రైతుబంధు ఇవ్వక, ఇటు సాగునీరు, కరెంట్ ఇవ్వక రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతుబంధు తనకే ఇంకా రాలేదు అని ఓ సమావేశంలో మాట్లాడారు. తన పక్కనే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వైపు చూస్తూ.. నాకే ఇంకా రైతు బంధు రాలేదు.. ఎందయ్యా అని భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాక ఇస్తా అన్నాడు అని తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని కేసీఆర్ ట్వీట్ చేశారు.
It is clear with this statement of State Agriculture Minister that the Congress has betrayed farmers of Telangana by not giving Rythu Bandhu! pic.twitter.com/11xd92W8ge
— KCR (@KCRBRSPresident) April 30, 2024