హనుమకొండ, మే 1 : హనుమకొండ హంటర్రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరిట చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ, ఈ నెల 6వ తేదీన వరంగల్లో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రైతు సదస్సు నిర్వహించే ప్రాంగణాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి పరిశీలించారు.