లండన్: టేబుల్ టెన్నిస్ వరల్డ్ టీమ్ చాంపియన్షిప్స్లో గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్కు చేరుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి గ్రూప్ దశలో అగ్రస్థానం అందుకున్నాయి. పురుషుల విభాగంలో శుక్రవారం భారత్ 3-0తో గ్వాటెమాలాపై అలవోకంగా నెగ్గింది. తొలి సింగిల్స్లో సతియాన్ 3-0తో కారిల్లొ సెరిగొను ఓడించగా రెండో సింగిల్స్లో మానవ్ ఠక్కర్.. 3-0తో మొరెల్స్ను మట్టికరిపించాడు. మూడో సింగిల్స్లో పరాస్ జైన్ సైతం 3-0తో రికార్డొపై గెలిచాడు. ఈనెల 4 నుంచి నాకౌట్ పోటీలు జరుగుతాయి.