BMW | న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ… దేశీయ మార్కెట్కు ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించింది.
సింగిల్ చార్జింగ్తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు.. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. అలాగే గంటకు 230 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 205కిలోవాట్ల ఏసీ చార్జర్ కలిగిన ఈ కారు బ్యాటరీ కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జికానున్నది. 14.9 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, 360 డిగ్రీల్లో కెమెరా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లతో రూపొందించింది.