జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా పెగడపల్లి మండల బీజేపీ సీనియర్ నాయకుడు, సుద్దపల్లి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు షేర్ మహేశ్ సహా 50 మంది పార్టీ కార్యకర్తలు బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
టీఆర్ఎస్సీనియర్ నాయకుడు, ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు తిర్మాణి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో బీజేపీకి చెందిన షేర్ మహేశ్, కోల తిరుపతి, రాచకొండ శ్రావణ్, కోల శేఖర్, మహేశ్, కోల రవి సహా 50 మందికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు గోలి సురేందర్రెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి