కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తార్రెం ఘటనలో మావోయిస్టుల చెరలో బందీ అయిన జవాన్ రాకేశ్వర్ సురక్షితంగానే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ఓ ఫొటోను విడుదల చేసింది. ఇప్పటికే మధ్యవర్తుల పేర్లు ప్రకటించి జవానుని విడిపించుకు వెళ్లాలని లేఖ విడుదల చేసిన ఆ పార్టీ.. తమ వద్ద బందీగా ఉన్న జవాన్ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చెయ్యడం వైరల్గా మారింది.