పాలమూరు, ఏప్రిల్ 30 : మహబూబ్నగర్లోని అపెక్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. 13మంది విద్యార్థులు (వీ.తేజస్విని, సుమయ్యముస్కాన్, వీ.యశస్విని, ఏ. సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జీ. సాయిచరణ్, ఆర్.గణేశ్నాయక్, రహమతుల్లాఖాన్, ఎం.నవీన్కుమార్, ఎం.మోక్షిత, జీ.మీనాక్షి, ఏ.అఖిల్చారి) 10జీపీఏ సాధించా రు. అదేవిధంగా ఎనిమిది మంది 9.8జీపీఏ, పదిమంది 9.7జీపీఏ, ఐదుగురు 9.5జీపీఏ సా ధించారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కే.శివజ్యోతి, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.