అమరావతి : ఏపీలోని న్యాయ కళాశాలల్లో వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ (Law Set ), పీజీ లా సెట్ దరఖాస్తు గడువును పెంచినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 4 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుంతో మే 11 వరకు, రూ.1000 ఆలస్య రుసుం (Late fee) తో మే 18 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 25 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుంతో మే 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.
దరఖాస్తుల సవరణకు మే 30 నుంచి జూన్ 1 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. లాసెట్ అడ్మిట్ కార్డులు జూన్ 3వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారమని, లా సెట్, పీజీ లా సెట్ పరీక్షలు జూన్ 9వ తేదీన మధ్యాహ్నం 2:30 నుంచి 4:00 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపారు. లా సెట్ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత మోడ్లో ఆన్లైన్ (Online) విధానంలో తెలుగు/ ఆంగ్లంలో జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.