న్యూఢిల్లీ: రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందంపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఢిల్లీ హైకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఒప్పందం అమలుపై ముందుకెళ్లరాదంటూ ఫ్యూచర్ రిటైల్ సంస్థను ఆదేశిస్తూ ఈ నెల 18వ తేదీన ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
కిశోర్ బియానీ ఆస్తుల జప్తు ఆదేశాలపైనా స్టే
ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ తదితరుల ఆస్తులను జప్తు చేయాలన్న ఆదేశాలను సైతం నిలిపివేసింది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు గతేడాది అక్టోబర్ 25వ తేదీన అత్యవసర ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు బీపీఎల్ కుటుంబాలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి ప్రధాని సహాయ నిధిలో రూ.20 లక్షలు జమ చేయాలన్న ఆదేశాలపైనా స్టే జారీ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్
సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఫ్యూచర్ ఇలా
సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ శనివారం ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై సోమవారం జస్టిస్లు డీఎన్ పటేల్, జస్మిత్ సింగ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదిగా భావిస్తున్న అమెజాన్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. గతేడాది రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థల మధ్య రూ.24,713 కోట్ల ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని అమెజాన్ వాదిస్తున్నది.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !