సోన్, అక్టోబర్ 3 : నిర్మల్ జిల్లాలో లక్ష్యం మేరకు ఆయిల్పాం సాగు చేపట్టేలా చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలం భాగ్యనగర్ రైతు వేదికలో ఆయిల్పాం సాగుపై సమీక్షా సమావేశం సోమవారం సాయం త్రం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో 18 మండలాల్లో ఈ ఏడాది 12వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేయాలని నిర్ణయిం చగా, కేవలం 50 శాతం మాత్రమే రైతులు సాగు చేశారని పేర్కొన్నారు.
మండలాల వారీగా నిర్దేశిం చిన లక్ష్యం, సాగైన వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఆయన వెనుకబడ్డ మండలాల్లో సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలన్నారు. సాగు చేస్తున్న రైతులకు బిందు, తుంపర్ల సేద్యం ద్వారా చేయూ తను అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం సాగుపై రైతుల్లో అవగాహన పెంచాలని కోరారు. నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఉద్యాన వనశాఖ అధికారి శ్యాంరావురాథోడ్, తహసీల్దార్ ప్రభాకర్, హిమబిందు, వ్యవసాయశాఖ అధికా రులు వసంత్రావు, ప్రవీణ్కుమార్, గణేశ్, సాయిప్రసాద్, స్రవంతి, తదితరులున్నారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
నిర్మల్ టౌన్, అక్టోబర్ 3 : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. మొత్తం ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.