Adani – Ambani | భారత కుబేరులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ చేతులు కలుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మధ్యప్రదేశ్ లోని గౌతం అదానీ ఆధీనంలోని పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే 500 మెగావాట్ల విద్యుత్ ను క్యాప్టివ్ యూజ్ కింద వాడుకునేందుకు రిలయన్స్, అదానీ గ్రూప్ మధ్య సంతకాలు జరిగినట్లు తెలుస్తున్నది. అదానీ పవర్ అనుబంధ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్ సంస్థలో రిలయన్స్ ఐదు కోట్ల ఈక్విటీ షేర్లకు కొనుగోలు చేస్తుంది. ఈ షేర్ ఒక్కో విలువ రూ.10. ఈ పవర్ ప్రాజెక్టు నుంచి 500 మెగావాట్ల విద్యుత్ను క్యాప్టివ్ యూజ్ కోసం వాడుకుంటామని రిలయన్స్, అదానీ సంస్థలు గురువారం స్టాక్ ఎక్స్చేంజీల్లో వేర్వేరుగా ఫైలింగ్ చేశాయి.
ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్.. ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి టెలికం రంగంపై ఫోకస్ చేస్తే విమానాశ్రయాల నుంచి నౌకాశ్రయాల మౌలిక వసతులు మొదలు, బొగ్గు మైనింగ్, క్లీన్ ఎనర్జీ రంగాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇద్దరూ క్లీన్ ఎనర్జీ బిజినెస్ మీద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2030 నాటికి దేశంలోనే అతిపెద్ద సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థగా ఎదగాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుండగా, గుజరాత్లో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్స్ నిర్మాణానికి నాలుగేసి గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ నిర్మిస్తున్నది.