న్యూయార్క్: అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు భారతీయులు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందారు.
మరొకరికి తీవ్ర గాయాలు కాగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గ్రీన్విల్లే కౌంటీలోని ఓ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు పరిమితికి మించిన వేగంతో కారు ప్రయాణిస్తున్నదని పోలీసులు భావిస్తున్నారు. కారు అదుపు తప్పి 20 అడుగుల ఎత్తుకు ఎగిరిందని, రోడ్డు పక్క చెట్లపై ఇరుక్కుందని పోలీసులు తెలిపారు.