తిరుపతి : తిరుపతి (Tirupati) గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Thirumanjanam) ఘనంగా జరిగింది. ఆలయంలో మే 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల (Brahmotsavam) ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా ఉదయం 6.30 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి, పార్థసారథి , ఆండాల్ అమ్మవారు, కల్యాణ వేంకటేశ్వరస్వామి (Venkateshwara Swamy), పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
తిరుమలను దర్శించుకున్న 64,766 మంది భక్తులు
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 64,766 మంది భక్తులు దర్శించుకోగా 24,158 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.