Firecracker Factory Blast | విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని చెంగమాలపట్టిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పది మంది వరకు గాయపడ్డారు. బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడు గదులు ధ్వంసమయ్యాయి.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది గదుల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల చెంగమలపట్టిలోని బాణాసంచా కర్మాగారంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడం అగ్నిమాపక శాఖ, పోలీసులకు సవాల్గా మారుతున్నది. ప్రమాదం ఘటనపై శివకాశి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.