మహబూబాబాద్ : జిల్లాలోని డోర్నకల్ మండలం బొడ్రాయి తండాలో మైనర్పై అత్యాచారయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పీకల దాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. మైనర్పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తిని బాలిక కుటుంబ సభ్యులు గుర్తించారు.
దీంతో అతను పారిపోయేందుకు యత్నించగా, పొరుగువారి సహాయంతో పట్టుకున్నారు. అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. బాధిత కుటుంబ సభ్యులు డోర్నకల్ పోలీసులకు సమాచారం అందించారు. బొడ్రాయి తండాకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..