హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్పై(Addanaki Dayakar) నిర్మల్(Nirmal) పోలీస్ స్టేషన్లో కేసు నమోదైయింది. ఈ నెల 5న రాహుల్ గాంధీ(Rahul gandhi) సభలో శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని అద్దంకి దయాకర్పై బీజేపీ నేతల ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పీఎస్లో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.