హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. కొత్తగా 987 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లారు. వైరస్ ప్రభావంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,30,514కు పెరిగింది. ఇప్పటి వరకు 6,15,852 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 3,720 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఒకే రోజు 1,06,045 కొవిడ్ నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.67శాతంగా ఉందని చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎం పరిధిలో 72, ఖమ్మంలో 72, నల్లగొండలో 59, వరంగల్ అర్బన్లో 51, కరీంనగర్లో 42, రంగారెడ్డిలో 38, మేడ్చల్ మల్కాజ్గిరిలో 35, పెద్దపల్లిలో 32, కొత్తగూడెంలో 31, మహబూబాబాద్లో 30 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వివరించింది.